తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.రెండో రోజు పర్యటనలో భాగంగా విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.
ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పురి, గజేంద్ర సింగ్ షెకావత్ తో విడివిడిగా భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఐపీఎస్ ల కేటాయింపు, ఆస్తుల విభజనకు సహకరించాలని అమిత్ షాను కోరారు.