లోన్ యాప్ మోసాల కేసులో ఈడీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చంఢీగడ్ తో పాటు గుజరాత్ రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో ఈడీ గత నెల 21వ తేదీన సోదాలు నిర్వహించింది.తాజాగా రూ.1.3 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.ఇందులో ముందుగా కాజీపేట, జనగామతో పాటు బెంగళూరులో లోన్ యాప్ కేసులు నమోదు అయ్యాయి.కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.యాప్ ద్వారా లోన్ ప్రాసెసింగ్ ను చేస్తామంటూ వ్యక్తిగత డేటాను రుణ యాప్ ముఠాలు తస్కరిస్తున్నాయని అధికారులు గుర్తించారు.