ఏపీలో జరగనున్న బీజేపీ ముఖ్యనేతల సమావేశానికి జాతీయ నేత తరుణ్ చుగ్ హాజరుకావడం లేదు.అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోతున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలకు సమాచారం అందింది.
అయితే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తులపై నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ కీలక సమావేశం జరగబోతుంది.ఈ సమావేశానికి తరుణ్ చుగ్ రావాల్సి ఉండగా ఆయన రావడం లేదని తెలుస్తోంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితర నేతలు హాజరుకానున్నారు.ఈ కీలక సమావేశం అనంతరం ఏపీ రాజకీయ పరిణామాలు, పొత్తులపై భేటీ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.







