ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్లు విడుదల చేయడం సంచలనంగా మారింది.
త్వరలోనే డీఎస్సీ( DSC ) సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satya Narayana ) మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టమైన నిర్ణయం వస్తుందని అన్నారు.
ఈ డీఎస్సీ పై చర్చలు జరుగుతున్నట్లు కూడా వ్యాఖ్యానించారు.సీఎం జగన్( CM Jagan ) విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపాదికన.పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో 240 లెక్చరర్ పోస్టుల( 240 Lecturer Posts ) భర్తీకి ఏపీపీఎస్సీ( APPSC ) నోటిఫికేషన్ కి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది.ఉద్యోగాలకు అర్హత, వయస్సు, జీతం తదితర పూర్తి వివరాలు జనవరి 24 లోపు https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనుంది.అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.కాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 47, పాలిటెక్నిక్ కళాశాలలో 99 లెక్చరర్ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే.ఈ క్రమంలో డిగ్రీ కాలేజీలకు( Degree Colleges ) సంబంధించి తాజాగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన చేయడంతో ఏపీలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







