ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది.
జనవరి 17వ తేదీలోగా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించనుంది.తరువాత జనవరి 22 న ఓటర్ల తుది జాబితాను సీఈసీ విడుదల చేయనుంది.
అయితే మొత్తం 12 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.బీహార్, హార్యానా, ఏపీ, కర్ణాటక, జార్ఖాండ్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాకు నిన్నటితో గడువు ముగిసింది.
తాజాగా ఆ గడువును కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.







