కంపెనీ కంపుతో గ్రామస్తుల కలవరం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సదరన్ ఆన్లైన్ బయోటెక్నాలజీ లిమిటెడ్ సంస్థకు చెందిన బయో డీజిల్ కంపెనీ నుండి సాయంత్రం వేళ వచ్చే దుర్వాసనతో గ్రామ ప్రజలు,ముఖ్యంగా గర్భిణీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ వాసనను కంపెనీ నుండి వెదజల్లే దుర్గంధం బారి నుండి ప్రజలను కాపాడే వారే లేరా అని వాపోతున్నారు.

 The Villagers Are Disturbed By The Stench Of The Company, Yadadri Bhuvanagiri, S-TeluguStop.com

అఖిలపక్ష నాయకులు ఏకతాటిగా నిలిచి గతేడాది కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సమస్యను వారంలో పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.

ఏడాది దాటినా నేటికీ సమస్యను పరిష్కరించకుండా మాట తప్పడంతో భయంకరమైన వాసన పీల్చి అనారోగ్యం బారిన పడతామని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇంత జరుగుతున్నా బయో యాజమాన్యం దుర్వాసనపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న శక్తులెవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం తక్షణమే విష వాయువు బారి నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని, లేదంటే గ్రమస్తులమే పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube