అక్కినేని( Akkineni ) హీరోలందరిలో నాగ చైతన్య( Naga Chaitanya ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక రీసెంట్ గా దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వాళ్ళని అలరించి తనదైన రీతిలో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ ( Vikram K Kumar )డైరెక్షన్ చేసి తనదైన రీతిలో ఆ స్టోరీ కి ప్రాణం పోసారనే చెప్పాలి.ఇక దీంతో వీళ్లిద్దరూ కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.
ఇక వీళ్ళ కాంబో లో ఇంతకు ముందు వచ్చిన థాంక్యూ సినిమా వీళ్లని తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ దూత సిరీస్( dootha series ) మాత్రం అందరిని ఆకట్టుకుంది.

ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఇంతకుముందే వీళ్ళ కాంబో లో మనం,థాంక్యూ అనే రెండు సినిమాలు వచ్చాయి.అందులో మనం సూపర్ డూపర్ హిట్ అవ్వగా, థాంక్యూ మాత్రం డిజాస్టర్ అయింది.
ఇక ఇప్పుడు దూత సిరీస్ తో మంచి సక్సెస్ ని అందుకొని వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

ఇక ప్రస్తుతానికి నాగచైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా అయిపోతే గాని తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనే దాని మీద క్లారిటీ రాదు…ఇక ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం నాగ చైతన్య మార్కెట్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుంది.కాబట్టి చందు మొండేటి తో చేస్తున్న తండేల్ సినిమా మీదనే ప్రస్తుతం నాగ చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా సక్సెస్ అయితే నాగ చైతన్య హిందీ లో కూడా పాపులర్ అవుతాడు
.







