ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఆయన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ కౌంటర్ దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.