శరీరంలో మలినాలు పేరుకుపోయే కొద్ది వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.అందుకే ఎప్పటికప్పుడు బాడీని డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను ప్రతి రోజూ తాగితే శరీరంలో పెరిగిపోయిన మలినాలు తొలగిపోవడమే కాదు బరువు కూడా తగ్గుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పది ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు యాపిల్ స్లైసెస్, ఐదు లవంగాలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన డ్రింక్ సిద్దం అవుతుంది.ప్రతిరోజు ఉదయానే ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో పెరుకు పోయిన మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ లో తీసుకోవడం వల్ల క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.తద్వారా వెయిట్ లాస్ అవుతారు.
అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు వాపు వంటివి దూరం అవుతాయి.
మెంటల్ స్ట్రెస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.మెదడు ప్రశాంతంగా మారుతుంది.
మరియు మార్నింగ్ సిక్ నెస్, హ్యాంగోవర్ వంటి వాటి నుంచి సైతం సులభంగా బయటపడతారు.