ఎన్నికలు సజావుగా సాగేలా అందరు సహకరించాలి : ఎస్సై సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలం( Ellantakunta )లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ కోరారు.

 Everyone Should Cooperate To Make The Elections Go Smoothly: Ss Sudhakar-TeluguStop.com

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి వల్లంపట్ల గ్రామంలో కవాతు నిర్వహించి ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు .

ఈ సందర్భంగా ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్( SI Sudhakar ) మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 పోలింగ్ ప్రదేశాల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు గాని, ప్రజలు గాని, యువకులు గాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రచారాలు నిర్వహించుకోవచ్చు అని,ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఉల్లంగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి.సుధాకర్ అన్నారు.ఎన్నికలలో కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావని,విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కు ఇబ్బంది ఉంటుందని గనుక అందరూ జాగ్రత్తలు వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ మధు, శ్రీకాంత్, జీవన్, లక్ష్మీనారాయణ, హోంగార్డు క్రాంతి,గ్రామస్తులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube