సూర్యాపేట జిల్లా: కారు బోరుకొచ్చింది,డ్రైవర్ (సారు)కు మతి తప్పింది ఇంకెన్నాళ్లు భరిద్దాం…? కారును షెడ్డుకు,సారును ఇంటికి సాగనంపుదామని పాలకవీడు ఎంపీపీ భూక్య గోపాల్,జెడ్పిటిసి మాలోత్ బుజ్జి అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం ఎల్లాపురంలో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియమ్మ ఇచ్చిన రాష్ట్రంలో పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని,
కేసీఆర్ నేతృత్వంలోని కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఉత్తమ్ హయాంలోనే పాలకవీడు మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతలా దేవి, నాయకులు మాలోతు మోతిలాల్ నాయక్, బైరెడ్డి జితేందర్ రెడ్డి, జాన్ పాషా, సతీష్, నరసింహ, రాజు నాయక్, సందీప్ నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.