తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు.ఈ మేరకు రాజాసింగ్ ఆయనకు వినతిపత్రం అందజేశారు.
గోషామహల్ నియోజకవర్గంలో పలు బూత్ లలో గతంలో లాగా రిగ్గింగ్ జరగకుండా చూడాలని వినతిపత్రంలో రాజాసింగ్ పేర్కొన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ టీవీ, సెంట్రల్ ఫోర్స్ ను ఉంచాలని విన్నవించారు.
బూత్ లోకి ఎవరు వచ్చినా ఐడీ కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎంఐఎం, బీఆర్ఎస్ వాళ్లు గోషామహల్ లో గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు.