తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత బీఆర్ఎస్ దని మంత్రి హరీశ్ రావు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగునీటిని అందిస్తున్నామన్నారు.
గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడేవాళ్లన్న మంత్రి హరీశ్ రావు ఇప్పుడు పోదాం పద బిడ్డ సర్కార్ ఆస్పత్రికి అన్న పరిస్థితి ఉందని చెప్పారు.గతంలో 36 శాతం డెలివరీలు జరగగా ఇప్పుడు 76 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయిని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వలసలు ఆగిపోయానని తెలిపారు.ఇంకా మనమే ఇతర రాష్ట్రాల వారికి అన్నం పెడుతున్నామని తెలిపారు.
గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్లు కానీ ఇప్పుడు కరెంట్ బాధలే లేవని వెల్లడించారు.ఇంత మంచి ప్రభుత్వం ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఒక్క ఛాన్స్ ఎందుకివ్వాలని ప్రశ్నించారు.







