నక్సల్స్ ప్రభావ నియోజకవర్గాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్?

హైదరాబాద్:అక్టోబర్ 30 తెలంగాణ( Telangana )లోని నక్సల్స్ ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగించనున్నట్లు ఈసీ తెలిపింది.సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్‌ జరగనున్నట్లు తెలిసింది.

 Polling In Constituencies Influenced By Naxals Till Four O'clock Telangana , T-TeluguStop.com

మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది.ఈ మేరకు నోటిఫికేన్ జారీ చేసింది.

నవంబర్ 30వ తేదీన జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇవాళ ఎన్నికల నిర్వహణపై ఈసీఐ రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు, నగదు సీజ్‌పై ఈసీ ఆరా తీయగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj ) ఈసీఐకి వివరాలు వెల్లడించారు.

ఎన్నికల కు సంబంధించిన నియమావళి పై అధికారులకు ఈసీఐ పలు సూచనలు చేసింది.,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube