తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ మసిపూసి మారెడు కాయ చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు.హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే గతంలో దళితబంధు తెచ్చారన్న ఆయన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని తెలిపారు.
ధనిక రాష్ట్రాన్ని దోచుకుని దేశంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం లాంటిదని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయాలనే కాంగ్రెస్ కోరుతోందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.







