ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ఇవాళ్టి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరగనుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టబోతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ట్రిబ్యునల్ వాటాలు తేల్చనుంది.మరోవైపు ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర సర్కార్ నిర్ణయం వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని ఏపీ వాదిస్తోన్న సంగతి తెలిసిందే.







