ఈ మధ్య కాలం లో తెలుగు వారికి ఫ్యాన్ ఇండియా అనే ఫీవర్ ను పరిచయం చేసారు రాజమౌళి.బాహుబలి అనే సినిమా తర్వాత ప్రతి సినిమా ఫ్యాన్ ఇండియా వ్యాప్తం గా విడుదల చేస్తున్నాం అని చెప్పడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపొయింది.
చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా ఉద అదే పని గా ప్యాన్ ఇండియా అనే పేరు చెప్పి పలు భాషల్లో సినిమాను డబ్ చేసి వదులుతున్నారు.రాజమౌళి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడం తో చాలా మట్టుకు తెలుగు లో అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి.
కుర్ర హీరో అయినా నిఖిల్ కూడా కార్తికేయ సీక్వెల్ తో ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టాడు.
కానీ ఇన్ని సినిమాలు హిట్ అవుతున్న, అందరిలో ఒక అనుమానం మాత్రం అలాగే ఉంటుంది.మొన్న సంక్రాంతి కి బాలయ్య బాబు, చిరంజీవి తమ సినిమాలతో వచ్చి కమర్షియల్ సక్సెస్ చేసుకున్నారు.అయితే 150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి వాల్తేరు వీరయ్య తో వచ్చి హిట్ కొట్టిన ఫ్యాన్ ఇండియా సినిమాగా మాత్రం ఆ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయాడు.
తెలుగు లో వచ్చి ఘనవిజయం సాధించింది.ఇక పక్క రాష్ట్రాల హీరోలు కూడా వచ్చి మన భాషలో సినిమాలు డబ్ చేసి హిట్ కొడుతుంటే ఎందుకు చిరంజీవి అంత దైర్యం చేయలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్న గా మారిపోయింది.
సైరా నరసింహ రెడ్డి వంటి సినిమా హిందీ లో సైతం విడుదల అయినా విజయం సాధించలేదు కాబట్టి ఆ తర్వాత మళ్లి ఆ సాహసం చేయడానికి చిరు బయటపడుతున్నాడా అని అందరి లో ఒక అనుమానం అయితే ఉంది.కానీ మెగా స్టార్ వంటి హీరో ఒక ఫ్యాన్ ఇండియా హిట్ కొడితే చూడాలని అయన అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రజలందరికి ఉంటుంది కదా.మరి తన అభిమానుల కోరిక మేరకు బోలా శంకర్ లేదంటే రానున్న మరి కొన్ని సినిమాలు సౌత్ తో పాటు హిందీ లో కూడా విడుదల చేసి హిట్ తన ఖాతా లో వేసుకొని మరో కొన్నేళ్లు దేదీప్యం గా వెలిగిపోవాలని ఆశిద్దాం.