టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )గురించి మనందరికీ తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
చిరంజీవి కెరీర్తో పాటు వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడ్డాయి.కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీశాయి.
అలాంటి ఓ చిత్రం రెండు సార్లు సెన్సార్కు వెళ్లి చిరంజీవి పరువును తీసాయి.ఆ వివరాల్లోకి వెళితే.
చిరంజీవి హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ ( E.V.V.Satyanarayana )దర్శకత్వంలో రూపొందిన చిత్రం అల్లుడా మజాడా.

ఈ సినిమాలో చిరంజీవి హీరో అయితే రమ్యకృష్ణ, ( Ramya Krishna )రంభ హీరోయిన్స్ వీరి తల్లి పాత్రలో సీనియర్ నటి వాణిశ్రీని నటింప చేయాలని ముందుగా దర్శకుడు ఇ.వి.వి అనుకున్నాడట.ఆమెను కలిసి పాత్రను వివరించాడు.అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా పోటీ పడి నటించారు.మరోసారి అల్లుడా మజాకా చిత్రంలో వాణిశ్రీ అత్త పాత్రలో నటించే అవకాశం వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించారు.అయితే నిజానికి చిరంజీవి, వాణిశ్రీ కలిసి అత్తకుయముడు అమ్మాయికి మొగుడు వంటి సూపర్ హిట్ మూవీలో నటించారు.
నటిగా వాణిశ్రీకి ఇదే రీ ఎంట్రీ మూవీ అత్త పాత్రలో చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేలా వాణిశ్రీ నటించింది.ఓ రేప్ సీన్లో నటించడం వంటి సన్నివేశాలు ఉన్నాయి.

అవి నచ్చని వాణిశ్రీ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.తర్వాత దర్శక నిర్మాతలు నటి లక్ష్మితో ఆ పాత్రను వేయించారు.వాణిశ్రీ, చిరంజీవి అత్తా అల్లుళ్ల కాంబోలో వచ్చిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమా( Aththaku Yamudu Ammayiki Mogudu ) చాలా పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.ఆ అత్త.
అల్లుడు సక్సెస్ మేజిక్ను రిపీట్ చేయాలని ఇ.వి.వి.సత్యనారాయణ, నిర్మాత దేవీ వర ప్రసాద్ భావించినా వాణిశ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు.ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి కథ, మాటలు అందించారు.చివరకు ఈ సినిమా విషయంలో వాణిశ్రీ అంచనాయే నిజమైంది.ఎందుకంటే ఓ రేప్లో సీన్లో రమ్యకృష్ణ, రంభ, వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే రేప్ సీన్ వివాదానికి కారణమైంది.అలాగే సినిమాలో లక్ష్మి వేషధారణ కూడా బాగా లేదని కామెంట్స్ వినపడ్డాయి.







