స్టేడియంలో ఘోరంగా కొట్టుకున్నారు పరుగులు తీసిన ప్రేక్షకులు.ఎల్బీ స్టేడియంలో( LB Stadium ) జరిగిన మోదీకేసరి దంగల్(కుస్తీ) పోటీల్లో వివాదం చెలరేగింది.
ఓ పక్క మ్యాచ్ జరుగుతుండగా.ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం దాడులు చేసుకున్నారు.
కుర్చీలతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి.పహిల్వాన్ల దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు.
పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు
.






