మన అమ్మని అమ్మ అని ఒప్పుకోకపోవడం ఎంత తప్పో ఒక మతం నుంచి మరొక మతంలోకి మారడం కూడా అంతే తప్పు.తాజాగా కర్ణాటక ప్రభుత్వం మతమార్పిడిని అడ్డుకొనేందుకు “రైట్ టూ ఫ్రీడం ఆఫ్ రిలిజియన్-2021( Right to freedom of religion )” బిల్లును పాస్ చేసింది ఆ రాష్ట్ర అసెంబ్లీ.
ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అంటూ ప్రతిపక్షాలు అరిచి గీ పెట్టినా బీజేపీ ప్రభుత్వం( BJP ) మాత్రం ససేమిరా పట్టించుకోలేదు.బలవంతపు మత మార్పిళ్ల వల్ల భారతీయ సమాజానికి పెను ప్రమాదం ముంచుకొస్తోందన్నది బీజేపీ నేతల వాదన.
అవును, అది సరియైనదే.గత వందేళ్లలో తీసుకుంటే అనేకమంది ఇక్కడ బలవంతంగా, మోసపూరితంగా మతమర్పిడిలకు గురయ్యారు.

ఇకపోతే ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడాన్ని నిషేధిస్తుంది ఈ చట్టం.అంతేకాకుండా మతం మార్చే ఉద్దేశంతో చేసుకున్న పెళ్లి కూడా చెల్లదని చెబుతున్నాయి ఈ రూల్స్.ఇలాంటి చట్టాలు దేశంలో కొత్తకాదు.పోయిన ఏడాది’లవ్ జిహాద్( Love jihad )’ పేరుతో ఓ చట్టం చేసింది ఉత్తర్ ప్రదేశ్.హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారుస్తున్నారనేది హిందుత్వవాదుల ఆరోపణ, అదే నిజం కూడా.కానీ ఆదేది పట్టని వెర్రి జనాలు అలాంటిది ఏం లేదు అన్నవారు లేకపోలేదు.

ఇపుడు ఈ తంతంతా ఎందుకంటే, తాజాగా సోషల్ మీడయా( social media )లో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో మత మార్పిడి కోసం ఊరికి వచ్చిన మిషనరీలను గ్రామస్తులు చెప్పుతో కొట్టడం ఇక్కడ చూడవచ్చు. మిషనరీలను మతమార్పిడి చేయమని ఒప్పించినందుకు గ్రామస్థులు కొట్టిన వీడియో ఈ ప్రాంతానిదో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.మనం ఇంకాస్త వెనక్కి చరిత్రలోకి వెళ్తే.మతమార్పిళ్లను నియంత్రిస్తూ చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఒడిశా.1967లో ఒడిశా ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్ను పాస్ చేశారు.







