వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని( perni nani ) శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్( Nara Lokesh ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని విమర్శించారు.బాబును రాజకీయ కక్షతో అరెస్టు చేసాం అనటం దారుణమని అన్నారు.
నారా ఫ్యామిలీ అంతా కలిసి నాటకం ఆడుతుంది.లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు.? ఎవరిని మేనేజ్ చేద్దామని.? 25 రోజులుగా ఢిల్లీలో ఎక్కడెక్కడికి వెళ్లారు.? ఎవరు కాలు పట్టుకున్నారు.? దొరకనంతవరకు అందరూ దొంగలే అంటూ పేర్ని నాని విమర్శించారు.
40 ఏళ్లలో చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడే దొరికారని, ఇప్పటివరకు దొరకనంతమాత్రాన దొర అయిపోరు కాదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.లోకేష్ ఉత్తమ కుమారుడి మాదిరిగా మాట్లాడుతున్నారని అన్నారు.
చంద్రబాబు ఆస్తులు, వ్యాపారాలపై విచారణకు సిద్ధమా అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు.నిజాయితీపరులైతే విచారణకు సిద్ధపడాలని సూచించారు.
దమ్ముంది కాబట్టే సీఎం జగన్( CM Jagan ) పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నారని స్పష్టం చేశారు.బీజేపీ కంటే చంద్రబాబే ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ మాదిరిగా జగన్ రోజుకో మాట మాట్లాడాలని చెప్పుకొచ్చారు.ఐదు రోజులుగా ఆట విడుపు యాత్ర చేస్తున్నారంటూ.
పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సెటైర్లు వేశారు.