తెలంగాణ తుది ఓటర్ జాబితా ప్రకటనపై సస్పెన్స్

తెలంగాణ తుది ఓటర్ జాబితా ప్రకటనపై సస్పెన్స్ నెలకొంది.షెడ్యూల్ ప్రకారం ఇవాళ తుది ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.

 Suspense Over Announcement Of Telangana Final Voter List-TeluguStop.com

అయితే తెలంగాణలో పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందాన్ని కాంగ్రెస్ కలిసింది.ఈ క్రమంలోనే తుది ఓటర్ జాబితాను ప్రకటించవద్దని కోరిందని తెలుస్తోంది.

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా యాభై వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్న కాంగ్రెస్ తుది ఓటర్ జాబితాను ప్రకటించవద్దని కోరింది.గత నెల 19వ తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 13 లక్షలుగా ఉంది.

కాగా జనవరి నుంచి ఇప్పటివరకు 14 లక్షల 72 వేల మంది కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది.మరోవైపు 3 లక్షల 39 వేల మందిని అధికారులు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ఓటర్ తుది జాబితా వెలువడుతుందా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube