సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో ప్రస్తుతం మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వెంకీ అట్లూరి( Venky Atluri ) ఒకడు.ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Mega Prince Varun Tej )తో కలిసి తొలిప్రేమ అనే సినిమా తీశాడు.
ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
దాంతో తన తదుపరి చిత్రం గా అఖిల్ ని హీరోగా పెట్టి మిస్టర్ మజ్ను అనే సినిమా తీశాడు ఈ సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఆ తర్వాత నితిన్ ని హీరోగా పెట్టి రంగ్ దే అనే సినిమా చేశాడు.
ఈ సినిమా కూడా అవరెస్ గా ఆడింది ఇక దాంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు.కానీ ఆయన తమిళ్ లో మంచి హీరోగా గుర్తింపు పొందిన ధనుష్ ని హీరోగా పెట్టి సార్ అనే ఒక సినిమా తీశాడు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

తెలుగు తో పాటు తమిళం లో కూడా సూపర్ హిట్ అయింది.ఇక ఈ సినిమాతో వెంకీ అట్లూరి మంచి ఫామ్ లోకి వచ్చాడు.అందుకే తన తదుపరి చిత్రంగా ఒక స్టార్ హీరోని ఎంచుకొని ఆయన తో సినిమాచేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రం గా తమిళ్ సూపర్ స్టార్ అయిన సూర్యతో( surya ) సినిమా చేయాల్సి ఉంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే వెంకీ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ కాంబోలో వచ్చే సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా గనక సూపర్ సక్సెస్ అయితే వెంకీ అట్లూరి తమిళ్ లోనూ, తెలుగులోనూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు… అలాగే తెలుగులో సైతం స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇస్తారనే చెప్పాలి…
.







