మెహర్ రమేష్( Mehar ramesh ) కి కెరీర్ ఆరంభం లో స్టైలిష్ డైరెక్టర్ అనే పేరు వచ్చింది.దాంతో పాటు ఒకటి రెండు మంచి సూపర్ హిట్స్ పడ్డాయి.
దాంతో అతడి గురించి తెగ ప్రచారం జరిగింది.కానీ సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా ఆయనకు మంచి విజయాన్ని ఇవ్వలేక పోయాయి.
మెహర్ రమేష్ కి ఎన్టీఆర్ తో పాటు చాలా మంది స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం దక్కింది.కానీ ఎన్టీఆర్ కి శక్తి వంటి అతి పెద్ద డిజాస్టర్ ఇవ్వడం వల్ల కెరీర్ మొత్తం ఖతం అయింది.
ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా శక్తి నిలవడం తో మెహర్ రమేష్ ని ఆ తర్వాత చాలా మంది హీరోలు పక్కన పెట్టారు.
అయితే చిరంజీవి( Chiranjeevi ) మాత్రం చాలా సంవత్సరాల తర్వాత భోళా శంకర్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు.బంధుత్వం తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వం పై నమ్మకం తో చిరంజీవి వేదాళం రీమేక్ బాధ్యతలను అప్పగిస్తే అతడు మొత్తం నాశనం చేశాడు.భోళా శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే తప్పకుండా ఒక స్టార్ హీరో సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకునేవాడు.
కానీ ఇప్పుడు ఆ హీరో మొహం చాటేస్తున్నాడు.అంతే కాకుండా మెహర్ రమేష్ కూడా అటు వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.ఏ మొహం పెట్టుకుని ఆ హీరోను డేట్లు అడగాలి, ఎలా కథను చెప్పాలి అనుకుంటున్నాడట.పాపం మెహర్ రమేష్ కి ఎంతటి కష్టం వచ్చింది అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెహర్ రమేష్ ఇక ముందు అయినా జాగ్రత్తగా సినిమాలు చేసుకోవాలి, చిన్న హీరోలతో కెరీర్ ను జీరో నుండి ప్రారంభించాలని కొందరు సూచిస్తున్నారు.మరి మెహర్ రమేష్ ప్రయత్నాలు మొదలు పెట్టేనా చూడాలి.