మెదక్ జిల్లాలోని శంకరంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటి కరువు ఉండేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.గతంలో కాంగ్రెస్ కల్యాణలక్ష్మీ, రైతుబంధు లాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు చెప్పే మాయమాటలను నమ్మొద్దని సూచించారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పథకాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగిందని పేర్కొన్నారు.ఎండాకాలంలోనూ చెరువులు నింపుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
పండిన ధాన్యాన్ని అంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.







