తిరుపతికి సీఎం జగన్.. కాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం

ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు.జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

 Cm Jagan To Tirupati.. Srinivasa Setu Flyover Will Start Soon-TeluguStop.com

ఇందులో భాగంగా మరి కాసేపటిలో తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తరువాత ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ భవనాలకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

తరువాత టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించనున్నారు.అనంతరం తిరుమలకు వెళ్లనున్న సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

తరువాత పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.కాగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్న సంగతి తెలిసిందే.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube