పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సుదీర్ఘకాలం పాటు షూటింగ్ ను జరుపుకుంటోంది.పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న స్థాయిలో హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.
ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో ఎక్కువ డేట్స్ అవసరం అవుతుండటం గమనార్హం.
అయితే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నిర్మాత ఏఎం రత్నంపై( Producer AM Rathnam ) అదనపు భారం అంతకంతకూ పెరుగుతోంది.
ఈ సినిమా మొదలై దాదాపుగా మూడేళ్లు అవుతోంది.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నా ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పెండింగ్ లో ఉందని సమాచారం అందుతోంది.
హరిహర వీరమల్లు సినిమా వల్ల క్రిష్( Director Krish ) కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది.

హరిహర వీరమల్లు షూట్ ఆలస్యం వల్ల ఈ నిర్మాతకు వడ్డీల రూపంలో భారీ స్థాయిలో నష్టాలు మిగిలాయని తెలుస్తోంది.పవన్ ఈ సినిమా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు సైతం వేగంగా పూర్తవుతుండటం గమనార్హం.మొఘలుల కాలం( Mughals ) బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హరిహర వీరమల్లు మూవీ టెక్నీషియన్ల విషయంలో కూడా కీలక మార్పులు జరిగాయని సమాచారం అందుతోంది.మూవీ ఆలస్యం వల్ల నిర్మాతపై 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని తెలుస్తోంది.పవన్ ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తే నిర్మాతలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.ఈ సినిమా వల్ల భారం పెరుగుతున్నా నిర్మాత ఏఎం రత్నం మాత్రం సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.







