చిత్తూరు జిల్లా పుంగనూరులో( Punganur ) నెల రోజుల క్రితం టీడీపీ…వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటం తెలిసిందే.ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం జరిగింది.
అయితే దాడిన ఆపే ప్రయత్నంలో పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం జరిగింది.పోలీసు వాహనాలను దగ్ధం చేశారు.
ఈ ఘటనలో కొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడటం కూడా జరిగింది.దీంతో పుంగనూరు ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
పోలీసులపై దాడి జరగటంతో పలు సెక్షన్ ల కింద కేసులు కూడా పెట్టడం జరిగింది.ఈ కేసులో 500 మంది నిందితులను గుర్తించినట్లు వేలల్లో 92 మందిని అరెస్టు చేసినట్లు అప్పట్లో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి( SP Rishant Reddy ) స్పష్టం చేయడం జరిగింది.

ప్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారని ఈ కేసులో నిందితుడైన పుంగునూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు,( Challa Babu ) గోవర్ధన్ రెడ్డి,( Govardhan Reddy ) డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్టులో అంగీకరించినట్లు తెలిపారు.వీడియో ఫుటేజ్ ఆధారంగా మొత్తం 500 మందిని గుర్తించినట్లు.92 మందిని అరెస్టు చేసినట్లు ఇంకా 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉందని స్పష్టం చేయడం జరిగింది.అయితే ఈ ఘటనలో అరెస్టయినా నిందితులకు ఇటీవల బెయిల్ రావడం జరిగింది.
ఈ పరిణామంతో పుంగనూరు దాడిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును( Supreme Court ) ఆశ్రయించింది.నిందితుల బెయిల్ కి సంబంధించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేయడం జరిగింది.







