సాధారణంగా నాటు పడవలు( boats ) అనేవి తెడ్ల సాయంతో నడుస్తాయి.ఆదేరకంగా మరపడవలు నడవాలంటే ఇంధనం కావాల్సిందే.
ఇక ఎలక్ట్రిక్ పడవలను నడపడానికి రీచార్జబుల్ బ్యాటరీలు వుండడం చాలా అవసరం.ఈ మూడింటి గురించి అందరికీ తెలిసినదే.
అయితే ఇపుడు కొత్తగా జలారుల అభ్యున్నతి కోసం నాలుగో రకానికి చెందిన పడవలు పుట్టుకొచ్చాయి.ఈ పడవలు అనేవి పూర్తిగా సౌరశక్తితో నడుస్తాయి.
దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్ చేస్తుంటాయి.

దీని ఫీచర్ల విషయానికొస్తే… బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 1.3 కిలోవాట్లు.అందుకే ఈ పడవలో రేయింబవళ్ళు పయనించినా ఎలాంటి ఇబ్బంది వుండదు.
ఇక పొడవు విషయానికొస్తే పదిహేనుడు అడుగులు, వెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు కలిగి వుంటుంది.కాగా ఈ పడవలో ఏకకాలంలో ఆరుగురు వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని దాని మేకర్స్ చెబుతున్నారు.

అయితే ఇది మనదగ్గర పడవ కదండోయ్.అమెరికన్ కంపెనీ ‘గోసన్’( Gosan ) ఇటీవల ఈ సోలార్ పడవను మార్కెట్లోకి తెచ్చింది.ఇది అక్కడి స్థానిక జాలరుల కోసమే ప్రత్యేకంగ తయారు చేసినట్టు చెబుతున్నారు.
ఇక ఇందులోని అనేక రకాల డిజైన్లు కూడా కలవు.పడవ డిజైన్ హంగులను బట్టి ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు వుంటుంది.అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు ఉంటుంది.కాబట్టి దీనిని కొనడం ఒకింత భారమే అయినప్పటికీ ఒన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు.ఇక మనదేశానికి ఇవి కావాలంటే మరింత ఖర్చుతో కూడుకున్న పని.అన్నీ టాక్సులను కలుపుకొని మొత్తం ఎనిమిది లక్షలు అవుతుంది.







