కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరూ సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ సందడి నెలకొంది.
ఇలా విడుదలైన సినిమాలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయ్.అదే సమయంలో కూడా లేకపోలేదని చెప్పాలి అయితే హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో అంతకుమించి ఫ్లాప్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఉన్నాయన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్లో హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జాయిష్ భాయ్ జోర్దార్. 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ కోణంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్గా మిగిలిపోయింది.హీరోపంతి, భాగి, వార్ లాంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో టైగర్ శ్రాఫ్ అయితే ఇటీవలే తన హిట్ మూవీ హీరో పంతి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమాతో మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు.
కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసిన హీరో షాహిద్ కపూర్.ఇక ఆ తర్వాత మరో తెలుగు మూవీ జెర్సీ హిందీలో రీమేక్ చేశాడు.కానీ సినిమా మాత్రం అయింది డిజాస్టర్ గా మిగిలిపోయింది.దీంతో షాహిద్ కపూర్ కి ఒక్కసారిగా షాక్ తగిలింది.ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన రాధేశ్యాం ఆచార్య సినిమాలు కూడా చివరికి నష్టాల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.దళపతి విజయ్ మాస్టర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇటీవల బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది.
సినిమా డిజాస్టర్ గా మిగిలింది.యాక్షన్ హీరో అజిత్ వాలిమై సినిమా ప్రేక్షకులను ఎక్కడ ఆకట్టుకోలేకపోయింది.
వరుసగా బయోపిక్లో తో హిట్ కొట్టిన సూర్య ఈసారి కమర్షియల్గా ఈటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సినిమా వద్ద బోల్తా పడింది.
కంగనా రనౌత్ థాక్కర్ సినిమా సైతం ఫ్లాప్ గా నిలవడం గమనార్హం.