తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంప కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మణుగూరులో తెల్లవారుజామున భూమి కంపించిందని తెలుస్తోంది.
మండలంలోని రాజుపేట, విఠల్ రావు నగర్, బాపనగుంట, శివలింగాపురం గ్రామాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది.
ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.అయితే మణుగూరులో ఈనెలలో భూమి కంపించడం రెండోసారి కావడం గమనార్హం.