భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది.ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇవ్వద్దని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు టికెట్ ఇవ్వొద్దని కోరేందుకు స్థానిక నేతలు అందరూ కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసేందుకు ఖమ్మానికి పయనం అయ్యారని సమాచారం.దాదాపు ఐదు మండలాల నేతలు మొత్తం 50 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లారు.
ఈ క్రమంలో భద్రాచలం నియోజకవర్గం టికెట్ బుచ్చయ్యకు ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.







