విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.గంగవరం పోర్టు ముట్టడికి నిర్వాసితులతో పాటు కార్మిక సంఘాలు ప్రయత్నించాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోర్టు బయట పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెలను సైతం తోసుకుంటూ నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతున్నారు.
లేని పక్షంలో తమ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని నిరసనకారులు హెచ్చరించారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.







