టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు.
ప్రాజెక్టులపై చంద్రబాబుకు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.
టీడీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మంత్రి ధర్మాన ఆరోపించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు.ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ మెంట్ దండగని చంద్రబాబు అన్నారన్నారు.
వంశధార పనులు 77 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.డిసెంబర్ లో వంశధారను జాతికి అంకితం చేస్తామని మంత్రి ధర్మాన వెల్లడించారు.