శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్( R Thyagarajan ) మిగతా వ్యాపారవేత్తలతో పోలిస్తే చాలా విభిన్నం.ఆయన పేద, వెనకబడిన వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీరామ్ ఫైనాన్స్ ప్రారంభించారు.
శ్రీరామ్ గ్రూప్లోని ప్రధాన సంస్థ అయిన ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ జులైలో తన షేర్లలో భారీ పెరుగుదలను చూసింది.త్యాగరాజన్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన అవలంబిస్తున్న విధానంలో మరింత సరసమైన ధరలకు రుణాలను అందించడం సాధ్యమైనని నిరూపితమైంది.ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకపోయినా రుణాలు సురక్షితంగా ఇవ్వవచ్చని, ఆ విధానం లాభదాయకంగా ఉంటుందని శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ చేతల్లో చేసి చూపించింది.

ఇటీవల త్యాగరాజన్ తన ఉద్యోగులకు దాదాపు రూ.6,120 కోట్ల సంపద మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.అతను ఒక చిన్న ఇల్లు, ఆరు లక్షల విలువైన కారుతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.క్రెడిట్ హిస్టరీలు లేని వ్యక్తులకు రుణాలు ఇవ్వడం ప్రమాదకరమనే భావనను తొలగించేందుకు త్యాగరాజన్ శ్రీరామ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
త్యాగరాజన్ తన వ్యాపార వ్యూహం అసాధారణమైనది కాదని నమ్ముతున్నారు.అతను తన సంపదలో గణనీయమైన భాగాన్ని ఎంపిక చేసిన ఉద్యోగులకు పంచారు.ట్రక్ ఫైనాన్సింగ్ రంగంలో వ్యక్తులు 100% వరకు వడ్డీ రేట్లు ఎదుర్కొంటున్నారని త్యాగరాజన్ గమనించారు, ఎందుకంటే సంప్రదాయ బ్యాంకులు వారికి రుణాలు అందించడానికి వెనుకాడుతున్నాయి.

శ్రీరామ్ గ్రూప్( Shriram Group ) 1974లో చెన్నైలో స్థాపించబడింది.ఇందులో ప్రస్తుతం ఏకంగా 1,08,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.త్యాగరాజన్ తమిళనాడులో ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.
చెన్నై( Chennai )లో మాథ్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.మాస్టర్స్ చదువుల సమయంలో మాథ్స్ అభ్యసించారు, ఆ తర్వాత కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మూడు సంవత్సరాలు చదువుకున్నారు.







