పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan Kalyan ) సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఉంటుంది.గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్( Bheemla Naik ) సినిమా విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చిందని చెప్పాలి.
అప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు కనుక విడుదలయితే ఏపీలో బెనిఫిట్ షోలు పడేవి ఈ షో కోసం పెద్ద ఎత్తున రేట్లు పెంచేసి సినిమాలను విడుదల చేసేవారు.అయితే భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది 10 సంవత్సరాల క్రితం జీవో వెలుగులోకి తెచ్చి ఈ సినిమా విషయంలో ఆంక్షలు విధించింది.

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కావడంతో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు లేకుండా చేసింది.కనీసం ఉదయం కూడా తొందరగా షోలు పడలేదు.10-11 మధ్య రెగ్యులర్ మార్నింగ్ షోల టైంలోనే సినిమా ప్రదర్శన మొదలైంది.దీనికి తోడు అప్పటికే ఉన్న రెగ్యులర్ రేట్లను కూడా తగ్గించి పడేశారు.
ఇలా రేట్లను కూడా భారీగా తగ్గించడంతో నిర్మాతలు ఏపీలో ఈ సినిమాని విడుదల చేసి నష్టపోయారని చెప్పాలి.అయితే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన బ్రో ( Bro ) సినిమా విషయంలో కూడా ఏపీ సర్కార్ ఇలాంటి ఆంక్షలు విధిస్తారని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోలేదు.వివిధ నగరాల్లో షోలు అయితే ఉదయం 7.30-9 గంటల మధ్య మొదలైపోతున్నాయి.అన్ని చోట్లా ఐదో షో పడుతోంది.
ఇలా ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉన్నారని అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్నికలు ( Elections ) దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న సమయంలో పవన్ సినిమాను గెలికితే అది తమ పార్టీకే ప్రమాదం కలుగుతుందని భావించి ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ మౌనం వహించారని తెలుస్తోంది.







