తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) ఒకరు.హిట్( Hit Movie ).
సిరీస్ దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శైలేష్ దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 సినిమా ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసింది.
ఈ సినిమా సక్సెస్ లో ఓ కుక్క కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.ఇందులో హీరోను కాపాడే సీన్ లో కుక్క కనిపించింది.ఈ కుక్క కూడా చాలా హైలైట్ అయింది.అయితే తాజాగా ఆ కుక్క మరణించడంతో డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
అయితే ఒక రోజు ముందు శైలేష్ తన డాగ్ మాక్స్ ( Max ) కి జ్వరం వచ్చిందని తనకోసం అందరూ ప్రార్థించండి అని కోరారు.అయితే ఆ డాగ్ చనిపోయినట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా శైలజ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ… బాధ తప్ప హృదయంతో ఈ వార్తను నేను మీకు తెలియజేస్తున్నాను.మాకు ఎంతో ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు.గత పది రోజులుగా తాను టిక్ ఫీవర్ ( Tick Fever )తో బాధపడుతు పోరాటం చేశాడు.నేను నా జీవితంలో కలుసుకున్న సున్నితమైనటువంటి సోల్ మేట్ లో మాక్స్ ఒకరు.
మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు.ఆఫీసర్ మాక్స్ నిన్ను చాలా మిస్ అవుతున్నాను.
మీరు లేకుండా హిట్ 2 సినిమాని ఊహించుకోలేము అంటూ ఈయన చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.