ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూ కేటాయింపులపై చర్చించిందని తెలుస్తోంది.1977 అసైన్డ్ భూముల చట్టంలో మార్పుల ప్రతిపాదనపై కూడా చర్చించింది.భూమి లేని నిరుపేదలకు అసైన్డ్, లంక భూముల పంపిణీ ప్రతిపాదనలపై కేబినెట్ చర్చిస్తుందని తెలుస్తోంది.అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు, అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై చర్చించనుంది.







