అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ వద్ద ఉద్రిక్తత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ఎదుట మృతుల బంధువులు ధర్నాకు దిగారు.నిన్న పరిశ్రమలో సంభవించిన అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.

 Tension At Achyutapuram Pharma Company In Anakapalli District-TeluguStop.com

కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

బంధువుల ధర్నాకు జనసేన, బీజేపీతో పాటు సీఐటీయూ నేతలు మద్ధతు తెలిపారు.

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

కాగా నిన్న పరిశ్రమలో రెండు రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో కంపెనీలోని ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube