అమ్మ వొడి కార్యక్రమం లో బాగం గా ఏర్పాటు చేసిన కురుపాం సభలో జనశెన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యక్తిగత విషయాలపై ముఖ్యమంత్రి జగన్( jagan ) మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ నుంచి ఘాటైన స్పందన వస్తుందని అందరూ ఊహించారు .అనుకున్నట్లుగానే భీమవరం వేదికగా జరిగిన మొదటి విడత లో వారాహి చివరి సభ ఆయన భీమవరంలో( Bhimavaram ) పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించిన జగన్ ను ఉద్దేశించి మిస్టర్ జగన్ రెడ్డి అంటూ పేరు పెట్టి మరి వార్నింగ్ ఇచ్చేశారు.

పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వివాహ వ్యవస్థను అపహస్యం చేశాడని పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొచ్చాడు అని పవన్ టార్గెట్ గా జగన్ మాట్లాడిన మాటలకు అదే స్థాయిలో పవన్ కౌంటర్ ఇచ్చేశారు మీ వ్యక్తిగత జీవితం కూడా నాకు పూర్తిగా తెలుసు, హైదరాబాద్( Hyderabad ) లో జరిగిన మీ వ్యవహారాలు నాకు మొత్తం తెలుసు , మీకు బాగా దగ్గర మనిషిని నా దగ్గరకు పంపిస్తే మీ జీవితం మొత్తం వివరిస్తాను.దాంతో వచ్చిన వారు చెవిలో రక్తం కారకపోతే ఒట్టు అంటూ వాఖ్యనించారు .

మీది ఎంత బలమైన వ్యవస్థ అయినా కావచ్చు కానీ నా పోరాటం ఆగదు అంటూ తేల్చి చెప్పారు ఇకపైన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే మాత్రం దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందంటూ ఆయన బ్లాస్ట్ అయ్యారు .ఉపయోగ గోదావరి జిల్లాలను వైసిపి రహిత జిల్లాలుగా మార్చాలంటూ భీమవరం వేదిక మరొకసారి పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రశాంతమైన గోదావరి జిల్లాలకు ఫ్రాక్షన్స్ సంస్కృతిని ( culture of fractions )తీసుకురావడానికి అనుమతించొద్దని ఆయన ప్రజలను కోరారు.
అన్ని రకాల వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శతదా ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల జనసేన చిత్తశుద్ధితో పని చేస్తుందని తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







