మీరు ఎన్నారై( NRI ) అయి ఉండి, భారతదేశం వెలుపల సంపాదించిన ఆదాయాన్ని లేదా తీసుకున్న రుణాన్ని ఉపయోగించి విదేశాలలో ఇంటిని కొనుగోలు చేశారా? అయితే, అసెస్మెంట్ (AY) 2023-24 ఇయర్ కోసం భారతదేశంలో మీ ఐటీ రిటర్న్ను( IT Return ) దాఖలు చేసేటప్పుడు మీరు ఆ కొనుగోలు వివరాలను అందించాల్సిన అవసరం లేదు.
నాంగియా అండర్సన్ ఇండియా డైరెక్టర్ చిరాగ్ నంగియా( Chirag Nangia ) ప్రకారం, ఒక ఎన్నారై కేవలం భారతదేశం నుంచి సంపాదించిన ఆదాయంపై మాత్రమే భారతదేశంలో పన్నులు చెల్లించాలి.
AY 2023-24 కోసం ఐటీ రిటర్న్లను దాఖలు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.పన్ను చెల్లింపుదారులు( Tax Payers ) 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

వేగవంతమైన ప్రాసెసింగ్, రీఫండ్లను పొందడానికి గడువు తేదీకి ముందే ఆదాయపు పన్ను రిటర్న్ను వీలైనంత త్వరగా ఫైల్ చేయాలని పన్ను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.ఆదాయపు పన్ను వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2023, జూన్ 11 వరకు AY 2023-24 కోసం మొత్తం 41,60,280 ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు అయ్యాయి.వీటిలో 37 లక్షల రిటర్న్లు వెరిఫికేషన్ చేశారు.3,949 రిటర్న్లు ప్రాసెస్ చేయబడ్డాయి.

పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లను స్వయంగా ఫైల్ చేయడానికి ఎంచుకోవచ్చు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి పన్ను నిపుణుల నుంచి సహాయం పొందవచ్చు.AY 2023-24 కోసం ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి గడువు తేదీ జులై 31, 2023.ఇది ఖాతాలపై ఆడిటింగ్ అవసరం లేని పన్ను చెల్లింపుదారుల కోసం నిర్దేశించిన గడువు తేదీ అని గమనించాలి.







