తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.ఈ క్రమంలో రేపు సాయంత్రం రాష్ట్ర నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
పలువురు సీనియర్ నాయకులతో పాటు ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లాల ముఖ్యనేతలకు పిలుపు వచ్చిందని తెలుస్తోంది.కాగా సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భేటీ కానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతలకు ఆహ్వానం అందిందని సమాచారం.







