ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తోంది.గ్లోబలైజేషన్( Globalization ) అనేది బాగా విస్తరించింది.
ప్రపంచంలోని ఎక్కడికైనా మనం వేగంగా చేరుకునేలా రవాణా సౌకర్యం వచ్చింది.అలాగే ఒక ప్రొడక్ట్ను ఎక్కడికైనా డెలివరీ చేసేలా లాజిస్ట్రిక్స్ సౌకర్యం మరింత పెరిగింది.
అయితే ఒక గ్రామంలోని చిన్న కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు.

స్వామీనాథన్ శంకర్ అంక్లేసరియా అయ్యర్( Swaminathan S Anklesaria Aiyer ) అనే వ్యక్తి 1992లో ప్రపంచీకరణ వైపు అనే బుక్ ను రాశారు.ఆయన ఒక జర్నలిస్ట్ , కాలమిస్ట్ కూడా.ఈ పుస్తకంలో ఆయన తన కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేస్తుందనే విషయాన్ని వివరించారు.’నా కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో స్కాలర్షిప్ గెలుచుకుని అక్కడ చదువుతోంది.అక్కడ స్పెయిన్ కు చెందిన జూలియా అనే యువకుడితో ప్రేమలో పడింది.
పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు.వీరి పెళ్లికి ఉత్తర అమెరికా, యూరప్, చైనాకు చెందిన 70 మంది స్నేహితులు హాజరయ్యారు” అని చెప్పారు.

ఇక కూతురు పెళ్లి ఇలా జరిగిందనుకుంటే.పెద్ద కూమారుడు శేఖర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు.ఆ తర్వాత కెనడాలోని టొరంటోకి ఉద్యోగం కోసం వెళ్లగా.అక్కడ ఫ్రాంజిస్కా అనే జర్మన్ అమ్మాయిని ప్రేమించాడు. వీళ్లు 2003లో పెళ్లి చేసుకున్నారు.ఇక చిన్న కుమారుడు రస్తమ్ ఆస్ట్రేలియాలో చదువుకుని నైజిరియన్ అమ్మాయిని వివాహమాడతాడేమో అని స్వామినాధన్ పుస్తకంలో చమత్కరించాడు.ఈ కుటుంబంలోని 50 మంది విదేశాల్లో స్ధిరపడ్డారు.స్వామినాథన్ తండ్రి లాహోర్ లో చార్టెడ్ అకౌంటెంట్ అవ్వగా.మామయ్య కరాచీలో హెటల్ మేనేజర్ గా పనిచశాడు.అలాగే వేరే వేరే మతాలకు చెందినవారిని పెళ్లి చేసుకున్నారు.
దీంతో ఈ కుటుంబాన్ని చూస్తూ ప్రపంచీకరణ ఎలా విస్తరిస్తుందో అర్థమవుతుంది.







