ఏపీలో బీజేపీ వైసీపీ( YCP vs BJP in AP ) మద్య రహస్య పొత్తు కొనసాగుతోందని, జగన్ ( Jagan )కు కేంద్రం అండగా నిలుస్తోందని, అందుకే కేంద్రం విషయంలో జగన్ విమర్శలు చేయడం లేదని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.ఆయా సందర్భాల్లో కొన్ని పరిణామాలు గమనిస్తే ఈ వార్తలలో నిజం ఉందేమో అనే అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి.
ఎందుకంటే ప్రత్యేక విషయంలోనూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ( Visakha Steel Factory ) విషయంలోనూ, విభజన హామీల విషయంలోనూ కేంద్రాన్ని ఎప్పుడు నిలదీసే దొరణి అవలంభించలేదు వైఎస్ జగన్.అలాగే జగన్ కోరితే నిధులను విడుదల చేయడంలోనూ, వివిధ కేసుల విషయంలో జగన్ కు అండగా నిలవడం లోనూ కేంద్రం జగన్ కు సహకరిస్తూ వస్తోంది.
దీంతో బీజేపీ వైసీపీ మద్య రహస్య పొత్తు( Secret alliance between BJP and YCP ) ఉందనే వార్తలు బలపడుతూ వచ్చాయి.ఈ వార్తలన్నీ కూడా ఇటీవల పటాపంచలు అయ్యాయనే చెప్పాలి.ఎందుకంటే ఇటీవల ఏపీ వచ్చిన బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా జగన్ సర్కార్ పై నిప్పులు( Amit Shah, JP Nadda ) చెరిగారు.కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ బొమ్మలు వేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.
ఏపిలో జగన్ సర్కార్ ఎంతో అవినీతికి పాల్పడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.అమిత్ షా మరియు నడ్డా వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ తో నో దోస్తీ అని స్పష్టం చేస్తున్నాయి.
ఇక వైఎస్ జగన్ కూడా తనకు బీజేపీ అండ అవసరం లేదంటూ ఇటీవల స్పష్టం చేశారు.
దీంతో వైసీపీ, బీజేపీ మద్య పొత్తు లేదనే విషయం రెండు పార్టీల అగ్రనేతలు చెప్పకనే చెప్పారు.దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ ను దెబ్బకొట్టేందుకు కేంద్ర బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేయబోతుంది.అనేది ఇప్పుడు ఆసక్తికరం.
గత కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.దీంతో ఆ దిశగా వ్యూహాన్ని వేగవంతం చేస్తుందా ? వైఎస్ వివేకా హత్య కేసు కూడా జగన్ కు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈ కేసుతో కూడా జగన్ కు చెక్ పెట్టనుందా.? కేంద్ర బీజేపీ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కొబోతున్నాడనేది ఆసక్తికరమైన చర్చ.మరి ఏం జరుగుతుందో చూడాలి.