రాక్షసులు మరేక్కడో లేరు... సెన్సేషనల్ వీడియో షేర్ చేసిన జబర్దస్త్ యాంకర్ రష్మీ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మి (Anchor Rashmi) ఒకరు.ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్(Extra Jabardasth) కార్యక్రమానికి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company) కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Anchor Rashmi Gautam Post A Video Calls Them Devils Details ,anchor Rashmi,extra-TeluguStop.com

ఇలా బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె వెండితెరపై సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ఇకపోతే రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే.

మూగజీవాలను ఎంతో ప్రేమించడమే కాకుండా వాటిని ఎవరైనా హింసిస్తే అసలు సహించరు.

ఇలా ఎన్నోసార్లు మూగజీవాలను హింసించిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ తన గలం వినిపించారు.ఇక మూగజీవాలకు హాని చేయొద్దని అందరికీ సూచించడమే కాకుండా రష్మీ ఏకంగా వీగాన్ గా మారిపోయారు.ఇలా జంతువుల పట్ల ఎప్పటికప్పుడు తన ప్రేమను చాటుకునే రష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక బాధాకరమైన వీడియో షేర్ చేశారు.

సముద్ర తీరాన పదుల సంఖ్యలో తిమింగలాలను సంహరిస్తున్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా తిమింగలాలను సంహరిస్తుండడంతో వాటి నుంచి వస్తున్నటువంటి రక్తంతో సాగర తీరం ఎరుపెక్కి పోయింది.ఇలాంటి దారుణమైనటువంటి ఒక వీడియోని రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాక్షసులు మరెక్కడ లేరు.ఇలాంటి వాళ్ల రూపంలో మనలోనే తిరుగుతూ మనతోనే ఉన్నారు అంటూ కామెంట్ చేశారు.

ఇలా రష్మీ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై పలువురు రష్మికి మద్దతు తెలుపగా మరికొందరు రష్మీ పట్ల విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube