రైతు బంధు జిల్లా కమిటీకి మందడపు తిరుమలరావు రాజీనామ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతుబంధు జిల్లా కమిటీ సభ్యత్వానికి రాజీనామ చేసినట్లు మందడపు తిరుమలరావు( Mandadapu Tirumala Rao ) పేర్కొన్నారు.ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయ నిర్మలకు తన రాజీనామ పత్రాన్ని బుధవారం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

 Mandadapu Tirumala Rao Resigns To Rythu Bandhu District Committee,rythu Bandhu,m-TeluguStop.com

రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఆసరా కల్పించకపోవడం, సాగునీటి సరఫరాలో విఫలం, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సీడి అందించడంలో నిర్లక్ష్యం, అకాల వర్షాలకు( Untimely Rains ) పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.ఈ నేపథ్యంలో రైతులకు సరైన న్యాయం చేయలేని ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామ చేసినట్లు వివరించారు.

సబ్బండ వర్గాల ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) బాటలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తిరుమలరావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube