వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రైతుల బాధలు చూసే తీరిక సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు.వ్యవసాయ శాఖ మంత్రి టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా కింద డిసెంబర్ లోగా కట్టాల్సిన ప్రీమియం కట్టకుండానే తప్పుడు జీవోలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.దళారులు రైతుల్ని దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
జగన్ చెప్తున్న ఉచిత వ్యవసాయ బీమా పథకం ఓ బూటకమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.







