అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… సిట్ పై న్యాయస్థానం ఏ దృష్టిలో చూడాలో అదే దృష్టి లో చూసింది.రాజకీయ పార్టీ ల నిర్ణయాలు…ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చెయ్యచ్చా లేదా అనేది ఎప్పుడు చర్చనీయాంశమే.
ప్రభుత్వ నిర్ణయం ప్రజలకి నష్టం కలిగించినప్పుడు ఖచ్చితంగా సమీక్ష జరగాలి.కక్ష పూరితంగా చేస్తే తప్పు…మా ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీ లో చర్చించాక సిట్ ఏర్పాటు జరిగింది.
లోతుగా చూడాలనే ఉద్దేశంతో సిట్ ఏర్పాటు జరిగింది.టీడీపీ సిట్ పై ఛాలెంజ్ చెయ్యడం దుస్సాహసం.
భారీ స్థాయిలో జరిగే విచారణలో టీడీపీ కి భయం ఎందుకు.ఆ రోజు స్టే తెచ్చుకున్న కూడా ఈ రోజు ఎత్తివెయ్యడం జరిగింది.
జగన్ ప్రభుత్వం రాష్ట్ర సంపద కు నష్టం కలిగించే కుట్రలను భగ్నం చేశారు.ఇప్పుడు విచారణ ఇంకా సులభతరం అవుతుంది.
అమరావతి భూ స్కామ్ నిజం చెయ్యడానికి ఇప్పుడు ఇంకా మార్గం సులువు అవుతుంది…ఫైబర్ నెట్…స్కిల్ దవలప్మెంట్ అన్నింటి లో విచారణ జరుగుతుంది… అన్ని బయటకు వస్తాయి.అమరావతి లో వేల ఎకరాల భూమి… తరతరాల సంపద కోసం రియల్ ఎస్టేట్ స్కామ్ గా మార్చారు….
అమరావతి లో ఎక్కడ టచ్ చేసిన అవినీతీ….ఇది ఒక కేస్ స్టడీ.అరెస్ట్ చేస్తే వేధింపులు.చెయ్యకపోతే ధైర్యం లేదు అంటారు…ఇది కక్ష సాధింపు కాదు….
దర్యాప్తు లో అన్ని తెలుస్తాయి.అరెస్ట్ లు కూడా ఉంటాయి…ఏమి పీకాం అంటున్నారు…అన్ని తెలుస్తాయి.







