వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన నినాదం, విధానమని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన చర్చలో అదే కీలక అంశమని తెలిపారు.
భవిష్యత్ లో మరిన్ని చర్చలు జరుగుతాయని నాదెండ్ల వెల్లడించారు.మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా సీట్లపై జరుగుతున్న ప్రచారాలు ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పారు.జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్న నాదెండ్ల అది భరించలేకనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని తెలిపారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు.