విశాఖ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో పోలీసులకు ప్రాథమిక రిపోర్ట్ అందింది.
శ్వేత ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నివేదికలో వెల్లడైంది.అనుమానాస్పద మృతిగా కేసు విచారణ చేస్తున్న త్రీ టౌన్ పోలీసులు శ్వేత భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచును అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.







